సత్తా చాటిన సంజన సంతోష్

సత్తా చాటిన సంజన సంతోష్

హైదరాబాద్‌‌, వెలుగు: ఆలిండియా సీనియర్‌‌ ర్యాంకింగ్‌‌ బ్యాడ్మింటన్‌‌ టోర్నమెంట్‌‌లో తెలంగాణ షట్లర్‌‌ సంజన సంతోష్‌‌ సత్తా చాటింది. ఢిల్లీకి చెందిన రోహన్‌‌ కపూర్‌‌తో కలిసి మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో టైటిల్‌‌ గెలిచింది. చెన్నైలో బుధవారం జరిగిన ఫైనల్లో సంజన–రోహన్‌‌ జోడీ 21–18, 21–16తో సుజిత్‌‌ (ఆర్‌‌బీఐ)–గౌరీకృష్ణ (కేరళ) జంటను వరుస గేమ్స్‌‌లో ఓడించి విజేతగా నిలిచింది. మెన్స్‌‌ సింగిల్స్‌‌ ఫైనల్లో  కేరళ షట్లర్‌‌ కిరణ్‌‌ జార్జ్‌‌ 21–17, 21–12తో శుభాంకర్‌‌ డే (రైల్వేస్‌‌)ను ఓడించి టైటిల్‌‌ నెగ్గాడు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో ఆకర్షి కశ్యప్ (చండీగఢ్‌‌) 21–15, 21–12తో తన్యా హేమంత్‌‌ (కర్నాటక)పై గెలిచింది.