దేశంలో బాలీవుడ్ కాదు టాలీవుడ్ టాప్ ఇండస్ట్రీ

దేశంలో బాలీవుడ్ కాదు టాలీవుడ్ టాప్ ఇండస్ట్రీ

గత కొన్ని రోజులుగా వివాదాస్పద ట్వీట్లు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లేటెస్ట్ గా టాలీవుడ్ పై కామెంట్ చేశారు. ఇండియాలో  బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దదని అందరూ అనుకుంటారు కానీ అది తప్పు ఇపుడు టాలీవుడ్ అగ్రస్థానానికి చేరుకుందని కంగనా ట్వీట్ చేశారు. ఏటా టాలీవుడ్  పాన్ ఇండియా మూవీలను నిర్మిస్తుందని చెప్పారు. ఎన్నో హిందీ మూవీలు హైదరాబాద్ లోని రామోజీ ఫిలీంసిటీలో షూటింగ్ లు  జరుపుకుంటున్నాయని తెలిపారు

ఉత్తరప్రదేశలోని నోయిడాలో అతిపెద్ద ఫిలీం సిటీ నిర్మించాలని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం మంచిదన్నారు. సినీ పరిశ్రమలో చాలా మార్పులు రావాలన్నారు. అన్ని సినీ ఇండస్ట్రీలు కలిసి  భారతీయ చిత్ర పరిశ్రమగా  ఉండాలన్నారు. మనమందరం విడిగా ఉండడం వల్ల హాలీవుడ్ లాభపడుతుందన్నారు.