
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో 3 నెలల బాలుడు మృతి చెందాడని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హాస్పటల్ ఎదుట తల్లిదండ్రులు బంధువుల ఆందోళకు దిగారు. ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులకు పైకి
తుంగతుర్తి మండలం గుడి తండాకు చెందిన జాటో జలందధర్ మనిషా దంపతుల చిన్నారికి నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. సూర్యపేట జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు రోజులు చిన్నారి ఆరోగ్యం బాగుందన్న డాక్టర్లు..తర్వాత క్షిణిస్తుందని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తీరా వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాక జూన్ 29న బాలుడు మృతి చెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన చిన్నారి బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రిపై రాళ్లు రువ్వారు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలు .. గాయపడ్డ కానిస్టేబుల్ ని ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలు మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.