కుప్పంలో వైసీపీ వర్సెస్ టీడీపీ

 కుప్పంలో వైసీపీ వర్సెస్ టీడీపీ

చిత్తూరు జిల్లా కుప్పంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ను ధ్వంసం చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కుప్పంలో వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఫ్లెక్సీలు చించేశారు. ఒకరిపై మరికొరు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసుకున్నారు. 

మరోవైపు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేయడంతో చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించేశారు. MLC భరత్ ఇంటి వైపు టీడీపీ కార్యకర్తలు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు. అయితే పోలీసుల తీరును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.