బీహార్​లో దారుణ హత్య.. కత్తితో కళ్లు.. .. ఛిద్రం చేసిండ్రు

బీహార్​లో దారుణ హత్య.. కత్తితో కళ్లు.. .. ఛిద్రం చేసిండ్రు

బీహార్​లో జరిగిన ఓ హత్యోదాంతం అక్కడి ప్రజల్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనలో బాధితురాలు మృతదేహం ఛిద్రమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖగారియా జిల్లాలోని పస్రాహా గ్రామానికి చెందిన సులేఖా దేవి(45)  పొలం పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.  దుండగులు ఆమె కళ్లు, రొమ్ములు కోసి, ప్రైవేటు భాగాలను ఛిద్రం చేసి అత్యంత పాశవికంగా హత్య చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆమె పొలానికి వెళ్లినప్పుడే ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు. 

గతంలో భర్త.. బావమరిది

సులేఖా దేవి భర్త బబ్లూ సింగ్, బావమరిది కూడా 2014లో హత్య కు గురయ్యారు. భర్త హత్య కేసులో నిందితులు గతేడాది బెయిల్​పై విడుదలయ్యారు. అయితే సులేఖ హత్య వెనక భూ తగాదా ఏమైనా ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

ఘటనా స్థలంలో కత్తి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​డీపీవో మనోజ్​కుమార్​ తెలిపారు. బాధితురాలి బంధువులతో పాటు స్థానికులు పస్రాహా పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసనకు దిగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది.సంఘటనా స్థలానికి ఎస్​డీపీవో  చేరుకుని నిందితులను పట్టుకుంటామని కఠిన శిక్ష పడేలా చేస్తామని బంధువులకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.