Test Cricket : ఐపీఎల్ వల్ల టెస్ట్ క్రికెట్ మర్చిపోతున్నారు : ఇయాన్ బోథం

Test Cricket : ఐపీఎల్ వల్ల టెస్ట్ క్రికెట్ మర్చిపోతున్నారు : ఇయాన్ బోథం

ఐపీఎల్ కారణంగా భారత్ లో టెస్ట్ క్రికెట్ చచ్చిపోయే దశకు చేరుకుందని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఇయాన్ బోథం అన్నాడు. మిర్రర్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇయాన్ బోథం మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కొందరు క్రికెట్ విశ్లేషకులు కూడా ఇయాన్ మాటలతో ఏకీభవిస్తున్నారు. ‘ఇండియాలో ఇప్పుడు ఎవరూ టెస్ట్ క్రికెట్ చూడడానికి ఇష్టపడటం లేదు. ఐపీఎల్ వల్ల బీసీసీఐకి కోట్లలో ఆదాయం వస్తుంది. ఆ మోజులో టెస్ట్ క్రికెట్ ను పట్టించుకోవడం మానేశారు. జనాలు కూడా ఆసక్తి చూపించడం లేదు. ఈ సంప్రదాయ ఆట మొదలై ఇప్పటికి వందేళ్లైంది. వేరే దేశాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. కానీ, భారత్ పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తోంద’ని ఇయాన్ బోథం అన్నాడు.