TG EAPCET 2025: ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి అంటే.?

TG EAPCET 2025: ఇంజినీరింగ్  కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి అంటే.?

తెలంగాణ ఇంజినీరింగ్ (TG EAPCET)  కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది.  మొత్తం మూడు విడతల్లో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ జరగనుంది.  జూన్  28 నుంచి మొదటి విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ జరగనుంది.జూలై 1నుంచి 8 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్.   జూలై  6 నుంచి10 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. జులై 18 న మొదటి విడత సీట్ల కేటాయిస్తారు.  

 జూలై 25 నుంచి  ఆగస్టు 3 వరకు  సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరగనుంది. 26న సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరగనుంది.  ఇక ఫైనల్ ఫేజ్ అంటే మూడో ఫేజ్ కౌన్సిలింగ్   ఆగస్ట్ 5 నుంచి  14 వరకు జరగనుంది. 

 ఇంజినీరింగ్ ఫలితాలను మే 11న సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌‌లో 73.26 శాతం మంది అర్హత సాధించగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌‌లో 87.82 శాతం మంది క్వాలిఫై అయ్యారు. గతేడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజీ స్వల్పంగా తగ్గింది. ఈ ఏడాది కూడా ఎప్ సెట్‌‌లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫలితాలు, ర్యాంకుల వివరాలను అధికారిక వెబ్‌‌సైట్ https://eapcet.tgche.ac.inలో పెట్టారు. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఎప్ సెట్ ఎగ్జామ్స్ జరిగాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌‌‌‌కు 81,198, ఇంజినీరింగ్ స్ట్రీమ్‌‌‌‌కు 2,07,190 మంది హాజరయ్యారు. ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసిన తర్వాత స్టూడెంట్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. 

►ALSO READ | Jobs: అటవీశాఖ(ఎఫ్ఎస్ఐ)లో టెక్నికల్ అసోసియేట్లు

ఇంజినీరింగ్ నుంచి 42 అబ్జెక్షన్లు రాగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌‌‌‌ నుంచి ఒక్కటీ రాలేదు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌‌‌‌లో 2,07,190 మంది పరీక్షలు రాయగా, 1,51,779 (73.26 %) మంది క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌‌‌‌లో 81,198 మంది ఎగ్జామ్‌‌‌‌కు అటెండ్ కాగా, 71,309 ( 87.82%) అర్హత సాధించారు