
- స్టూడెంట్ బస్ పాస్లపై 50 శాతం
- ఇక మెట్రో ఎక్స్ప్రెస్లలోనూ విద్యార్థులకు అనుమతి
- సోమవారం నుంచే అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్పరిధిలో బస్పాస్రేట్లు పెరిగాయి. ఆర్డినరీ పాస్లపై 23 శాతం, స్టూడెంట్బస్ పాస్లపై 50 శాతం రేట్లు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెంచిన రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో నెలవారీ బస్పాస్లతో ప్రయాణించే వారిపై ఆర్థికభారం పడనుంది. స్టూడెంట్ బస్పాస్ రేట్లను గత మూడేండ్లుగా పెంచలేదని, సంస్థపై పెరిగిన ఖర్చుల భారం నుంచి కొంత ఊరట పొందడానికే చార్జీలను పెంచినట్టు అధికారులు తెలిపారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి స్టూడెంట్స్మెట్రో ఎక్స్ప్రెస్లలో కూడా ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. అలాగే టోల్ప్లాజా యూజర్చార్జీలను కూడా సవరించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టోల్ప్లాజా మీదుగా వెళ్లే ప్రతి ప్రయాణికుడి నుంచి అదనంగా ప్లాజాకు రూ.10 వసూలు చేస్తామన్నారు. టోల్ప్లాజా మీదుగా ప్రయాణించక పోతే యూజర్చార్జీలు ఉండవని పేర్కొన్నారు.