ఈసీకి పార్టీ పేర్లు, గుర్తులు పంపిన ఉద్ధవ్ వర్గం

ఈసీకి పార్టీ పేర్లు, గుర్తులు పంపిన ఉద్ధవ్ వర్గం


న్యూఢిల్లీ: ముంబైలోని అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక కోసం మూడు పేర్లు, గుర్తులను ఉద్ధవ్ వర్గం ప్రతిపాదించింది. వాటిని ఆదివారం ఎలక్షన్ కమిషన్ కు పంపించింది. శివసేన బాలాసాహెబ్ థాక్రే, శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే, శివసేన బాలాసాహెబ్ ప్రబోధంకర్ థాక్రే పేర్లను పంపినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. ఇక త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడ గుర్తుల్లో ఒకటి కేటాయించాలని కోరినట్లు చెప్పాయి.

కాగా, శివసేన ఓనర్​షిప్​పై వివాదం కారణంగా ఆ పార్టీ పేరు, గుర్తును ఉద్ధవ్, సీఎం ఏక్ నాథ్ షిండే వర్గాల్లో ఎవరికీ కేటాయించకుండా ఈసీ స్తంభింపజేసింది. అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు కొత్త పేర్లు, గుర్తులను పంపాలని రెండు వర్గాలకు సూచించింది. ఆయా వర్గాలు పంపే వాటిలో ఒక పేరు, గుర్తును వాళ్లకు కేటాయిస్తుంది.