Thandel OTT Rights: చైతు కెరీర్లోనే అత్యధికంగా తండేల్ ఓటీటీ హక్కులు..కళ్లు చెదిరే మొత్తానికి దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ!

Thandel OTT Rights: చైతు కెరీర్లోనే అత్యధికంగా తండేల్ ఓటీటీ హక్కులు..కళ్లు చెదిరే మొత్తానికి దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ!

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. ‘తండేల్’ పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఇందులో నాగచైతన్యకి జోడిగా సాయి పల్లవి నటిస్తుంది. 

ఇదిలా ఉంటే..ఈ మూవీ ఓటీటీ హక్కులకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే భారీ అంచనాల మధ్య వస్తోన్న ఈ సినిమా కోసం  ఏకంగా రూ.40 కోట్లకు కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తా నిజమే అని తెలుస్తోంది. నాగ చైతన్య కెరీర్లోనే..ఈ సినిమా డిజిటల్ హక్కులు ఇంత భారీ మొత్తంలో అమ్ముడు పోలేదు.దీంతో ఈ సినిమా కథ అనుగుణంగా ఇంత మొత్తంలో అమ్మడపోయినట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  

తండేల్ కథేంటి? 

గుజరాత్‌ లోని సూరత్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. బోటు నడిపే వ్యక్తి బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లగా..అలా సముద్రవేట లో ఉంటూ పాకిస్థాన్‌ కోస్టుగార్డుల చెరలో చిక్కుతాడు.అలా అక్కడి పాకిస్థాన్ జైలు నుంచి..తాను ప్రేమించిన వాడు ఎప్పుడొస్తాడో అని ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకు రానుంది. ఆ లెక్కన ఓటీటీలో వచ్చే ఏడాది 2025 జనవరిలోనే స్ట్రీమింగ్ అవుతుంది.