
నాని హీరోగా విక్రమ్ కుమార్ రూపొందించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి లభిస్తోన్న స్పందన గురించి తెలియజేసేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. నాని మాట్లాడుతూ ‘నేను లోకల్ సినిమాలో ఫీల్డర్స్ లేని గ్రౌండ్లో ఫోర్ కొడితే కిక్కే ఉండదు అని ఓ డైలాగ్ ఉంది. కానీ ఎడిటింగ్లో తీసేశాం. ఇప్పుడది ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకి వాడాలనిపిస్తోంది. నిమజ్జనం లాంటి కారణాల దృష్ట్యా విడుదల రోజు కొంత భయపడ్డాం. కానీ ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రతి షోకీ గ్రాఫ్ పైకి వెళ్లింది. శనివారం ఉదయం కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా మేము మాట్లాడాం, ఇక నుండి సినిమానే మాట్లాడుతుంది. ఇంతటి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. సోషల్ మీడియాలో కూడా అద్భుత స్పందన లభిస్తోంది. కార్తికేయ నటనని, వెన్నెల కిషోర్ కామెడీని మెచ్చుకుంటున్నారు. తొలి సినిమాకే ప్రియాంకా మోహన్కి ఫ్యాన్ క్లబ్ క్రియేట్ చేశారు. మైత్రి మూవీస్కి మరో విజయం లభించడం హ్యాపీ. నవ్వులు, కేరింతలతో ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు’ అని చెప్పాడు.
‘థియేటర్స్లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అని దర్శకుడు విక్రమ్ అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ ‘నా పాత్రకి ఇంతటి స్పందన లభించడం ఓ కలలా ఉంది. నా పెర్ఫార్మెన్స్కి కారణం విక్రమ్గారే. ఆయనే నేర్పించి చేయించారు. మొదట్నుంచీ నాని గారు నాకు స్పూర్తి. ఈ చిత్రంతో ఒక మెంటర్ అయ్యారు. ఆయన గెలవడంతో పాటు మమ్మల్నందరినీ గెలిపించారు’ అని చెప్పాడు. ప్రేక్షకుల స్పందన చూస్తే ఆనందంగా ఉందని చెప్పింది ప్రియాంక. నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ‘అద్భుతమైన కలెక్షన్స్తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చక్కని రెస్పాన్స్ లభిస్తోంది. మౌత్ పబ్లిసిటీతో థియేటర్స్ పెరిగాయి. చాలా చోట్ల నాని గారికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. లాంగ్ రన్లో మరింత బెస్ట్ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నాం’ అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ సి.ఇ.ఓ.చిరంజీవి(చెర్రీ), సినిమాటోగ్రఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.