నూతన హైకోర్టుకు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

నూతన హైకోర్టుకు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర  హైకోర్టు భవన నిర్మాణానికి బుధవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్  ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. నూతన హైకోర్టు నిర్మాణానికి రాజేంద్రనగర్ లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో నుంచి 100 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంగా రాజకీయ నేతలు ఎవరూ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు.

పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధేతో పాటు ఇతర న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూడ్  శంకుస్థాపన చేశారు.