అధికార పార్టీ నేతల మధ్య కక్షలు.. మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య

అధికార పార్టీ నేతల మధ్య కక్షలు.. మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య

వికారాబాద్ జిల్లాలో  దారుణ హత్య జరిగింది. మాజీ ఎంపీపీభర్తను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పెద్దేముల్ మండలం హన్మాపూర్ లో  మాజీ ఎంపీపీ వాణిశ్రీ భర్త వీరప్పను అతి కిరాతకంగా కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు.  అధికార పార్టీ నేతల మధ్య ఉన్న రాజకీయ కక్షలే హత్యకు  కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి నాయకుల మధ్య ఉన్న కక్షలు హత్యకు దారి తీయడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేసీఆర్ కుట్రలో పడి ఎన్నికల్లో పోటీచేయొద్దు..

చెట్టుపై చిటారు కొమ్మన చిరుత..

పీవీపై ప్రేమ ఉంటే వాణిదేవికి రాజ్యసభ సీటివ్వాలి