మా జీతాలు పెంచండి.. ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి

మా జీతాలు పెంచండి.. ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి

హైదరాబాద్, వెలుగు : తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధి హామీ స్కీమ్ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం కోరింది. సోమవారం మంత్రులు హరీశ్ రావు, దయాకర్ రావులను ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రమేశ్ కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనారోగ్య కారణాలతో హాస్పిటల్ లో ఉన్న 280 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. 

ఫీల్డ్ అసిస్టెంట్లను ఫుల్ టైమ్ ఈక్వలెంట్ గా గుర్తించాలని కోరారు. తమ వినతిపై మంత్రులు సానుకూలంగా స్పం దించారని, త్వరలో ఉన్నతాధికారులతో మాట్లాడుతామని హామీ ఇచ్చారని సంఘం నేతలు పేర్కొన్నారు.