మొక్కు చెల్లించుకున్న ఈటల

మొక్కు చెల్లించుకున్న ఈటల

రాష్ట్రంలో చివరి గింజదాక కొంటానని రైతులను కేసీఆర్ మోసం చేశారన్నారు.. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనేలా చేస్తామన్నారు. డిసెంబర్ 10 తర్వాత  గ్రామ గ్రామన పర్యటిస్తానన్నారు ఈటల. కమలాపూర్ మండలం బత్తినవానిపల్లి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈటల. ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్ర టైమ్ లో కట్టిన ముడుపు మొక్కు చెల్లించుకున్నారు.