సందడిగా ఐస్​క్రీం టేస్టింగ్​ ఛాలెంజ్

సందడిగా ఐస్​క్రీం టేస్టింగ్​ ఛాలెంజ్

విజయ డెయిరీ, హైబిజ్ టీవీ కలిసి ఆదివారం మాదాపూర్​లోని మేదాన్ ​ఎక్స్​పో సెంటర్​లో నిర్వహించిన ‘ది గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీం టేస్టింగ్ ​చాలెంజ్’​ సందడిగా సాగింది. 20కి పైగా ఐస్​క్రీం స్టాల్స్ ఏర్పాటు చేయగా.. వెయ్యి మందిపైకిగా పాల్గొని వివిధ రకాల ఐస్​క్రీంలను ఆస్వాదించారు. ఈ టేస్టింగ్ ​చాలెంజ్​లో ఎల్​బీనగర్​కు చెందిన భవాని ఫస్ట్​ప్రైజ్ ​కింద రూ.లక్ష క్యాష్, రూ.40 వేల హాలిడే ట్రిప్ గెలుచుకున్నారు. కొండాపూర్​కు చెందిన సల్మా మహ్మద్​ రూ.50 వేలు క్యాష్, రూ.25 వేల హాలిడే ప్యాకేజీ, ఉప్పల్​కు చెందిన దుర్గాప్రసాద్ ​రెడ్డి రూ.25 వేలు క్యాష్, రూ.10 వేల హాలిడే ప్యాకేజీని గెలుచుకున్నారు. విజయ డెయిరీ తెలంగాణ చైర్మన్ సోమా భరత్ ​కుమార్ చీఫ్​ గెస్ట్​గా పాల్గొని విజేతలకు గిఫ్ట్​లను అందజేశారు.  

– వెలుగు, మాదాపూర్