విజయ డెయిరీ, హైబిజ్ టీవీ కలిసి ఆదివారం మాదాపూర్లోని మేదాన్ ఎక్స్పో సెంటర్లో నిర్వహించిన ‘ది గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీం టేస్టింగ్ చాలెంజ్’ సందడిగా సాగింది. 20కి పైగా ఐస్క్రీం స్టాల్స్ ఏర్పాటు చేయగా.. వెయ్యి మందిపైకిగా పాల్గొని వివిధ రకాల ఐస్క్రీంలను ఆస్వాదించారు. ఈ టేస్టింగ్ చాలెంజ్లో ఎల్బీనగర్కు చెందిన భవాని ఫస్ట్ప్రైజ్ కింద రూ.లక్ష క్యాష్, రూ.40 వేల హాలిడే ట్రిప్ గెలుచుకున్నారు. కొండాపూర్కు చెందిన సల్మా మహ్మద్ రూ.50 వేలు క్యాష్, రూ.25 వేల హాలిడే ప్యాకేజీ, ఉప్పల్కు చెందిన దుర్గాప్రసాద్ రెడ్డి రూ.25 వేలు క్యాష్, రూ.10 వేల హాలిడే ప్యాకేజీని గెలుచుకున్నారు. విజయ డెయిరీ తెలంగాణ చైర్మన్ సోమా భరత్ కుమార్ చీఫ్ గెస్ట్గా పాల్గొని విజేతలకు గిఫ్ట్లను అందజేశారు.
– వెలుగు, మాదాపూర్