అదానీ గ్రీన్ ఎనర్జీ సబ్సిడరీల విలీనం

అదానీ గ్రీన్ ఎనర్జీ సబ్సిడరీల విలీనం
  • అదానీ గ్రీన్ ఎనర్జీ సబ్సిడరీల విలీనం

న్యూఢిల్లీ : అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన రెండు స్టెప్ డౌన్ అనుబంధ సంస్థలైన అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఫిఫ్టీ సిక్స్ లిమిటెడ్, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఫిఫ్టీ సెవెన్ లిమిటెడ్‌‌లను విలీనం చేస్తున్నట్లు శుక్రవారం ఈ గ్రూపు ప్రకటించింది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్ నైన్ లిమిటెడ్ కంపెనీ పూర్తి- యాజమాన్య అనుబంధ సంస్థ. ఇది అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఫిఫ్టీ సిక్స్ లిమిటెడ్, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఫిఫ్టీ సెవెన్ లిమిటెడ్​లను విలీనం చేసిందని గ్రూపు రెగ్యులేటరీ ఫైలింగ్​లో తెలిపింది. రెండు స్టెప్ డౌన్ అనుబంధ సంస్థలకు రూ.  లక్ష చొప్పున ఆథరైజ్డ్​, పెయిడ్​ అప్​ షేర్ క్యాపిటల్‌‌ ఉంది. 

పవన శక్తి, సౌరశక్తి లేదా ఇతర పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి ఏ రకమైన శక్తి లేదా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం, అభివృద్ధి చేయడం, మార్చడం, పంపిణీ చేయడం, ప్రసారం చేయడం, విక్రయించడం, సరఫరా చేయడం కొత్త అనుబంధ సంస్థల ప్రధాన లక్ష్యం. కొత్త అనుబంధ సంస్థలను ఈ నెల 14న గుజరాత్‌‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌‌లో అహ్మదాబాద్‌‌లో రిజిస్టర్​ చేశారు. ఇవి ఇంకా తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించలేదని అదానీ గ్రూపు తెలిపింది.

ఏఈసీటీపీఎల్ లో మెడిటరేనియన్​కు వాటా

అదానీ ఎన్నోర్‌‌ కంటైనర్ టెర్మినల్ (ఏఈసీటీపీఎల్‌)  ​లో 49 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ శుక్రవారం తెలిపింది. ఈ డీల్​ విలువ రూ.247 కోట్లు. ఈ మేరకు వాటా కొనుగోలు ఒప్పందంపై డిసెంబర్ 14, 2023న సంతకం చేసినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్​) ఒక ప్రకటనలో తెలిపింది. ఏఈసీటీపీఎల్​ మొత్తం ఎంటర్‌‌ప్రైజ్ విలువ రూ. 1,211 కోట్లు అని పేర్కొంది. లావాదేవీ నియంత్రణ ఆమోదాలకు లోబడి ఉంటుంది. ఈ డీల్ 3-4 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. లావాదేవీ పూర్తయిన తర్వాత, ఏపీసెజ్​కు​ ఏఈసీటీపీఎల్​లో 51 శాతం వాటా ఉంటుందని ప్రకటన పేర్కొంది. ముండి లిమిటెడ్ అనేది టెర్మినల్ ఇన్వెస్ట్‌‌మెంట్ లిమిటెడ్ మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ అనుబంధ సంస్థ.