కరోనా భయంతో హార్ట్‌‌‌‌ పేషెంట్‌‌‌‌ ‌‌‌‌ఉన్న అంబులెన్స్‌‌‌‌ను ఆపేసిన్రు

కరోనా భయంతో హార్ట్‌‌‌‌ పేషెంట్‌‌‌‌  ‌‌‌‌ఉన్న అంబులెన్స్‌‌‌‌ను ఆపేసిన్రు

గాంధీనగర్‌‌‌‌: అది శనివారం రాత్రి.. ఓ హార్ట్‌‌‌ పేషెంట్‌‌ అర్జెంట్‌‌‌‌ చెకప్ ‌‌‌‌కోసం దగ్గర్లోని ఇమేజింగ్ ‌‌‌‌సెంటర్‌‌‌‌కు అంబులెన్స్‌‌‌‌లో వెళ్లారు. కానీ ఆ సెంటర్ ‌‌‌‌ఉన్న ప్రాంతంలోని స్థానికులు అంబులెన్స్‌‌‌‌ను తమ రెసిడెన్యషిల్ ‌‌‌‌ప్రాంతంలోకి రానివ్వలేదు. కరోనా భయంతో గేట్లు మూసి తాళమేశారు. గుజరాత్‌‌‌‌లోని వడోదరలో ఈ సంఘటన జరిగింది. ఇమేజింగ్ ‌‌‌‌సెంటర్ ‌‌‌‌పోలీసులకు ఫోన్‌‌‌‌ చేయడంతో వాళ్లొచ్చి అంబులెన్స్‌‌‌‌ను పంపించడానికి ప్రయత్నించారు. అయినా లోకల్స్‌ ‌‌వినలేదు. అడ్డుకోవడానికి ట్రై చేశారు. ఇమేజింగ్‌‌‌ సెంటర్ ‌‌‌‌ఫిర్యాదుతో 13 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వాళ్లు అల్కాపురి ప్రాంతం వాళ్లని పోలీసులు చెప్పారు. అంబులెన్స్‌‌‌‌లో ఉన్నది హార్ట్ ‌‌‌పేషెంటని, అర్జెం‌ట్ ‌‌‌‌చెకప్ ‌‌‌‌కోసం వచ్చారని తెలిపారు. ఇమేజింగ్ ‌‌‌‌సెంటర్‌‌‌‌లో ఎలాంటి కొవిడ్ ‌‌‌‌టెస్టులు కూడా చేయరని చెప్పారు. కానీ కొవిడ్ ‌‌‌‌భయంతో స్థానికులు అడ్డుకున్నారన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం