మహేశ్వరం ఎంపీపీ ఎన్నిక జరపండి

మహేశ్వరం ఎంపీపీ ఎన్నిక జరపండి
  • ఫలితాన్ని బహిర్గతం చేయొద్దు : హైకోర్టు

 హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల ప్రజా పరిషత్‌‌‌‌‌‌‌‌ అధ్యక్ష ఎన్నికను నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే, తుది ఉత్తర్వుల జారీ వరకు ఆ ఎన్నిక ఫలితాన్ని బహిర్గతం చేయొద్దని చెప్పింది. కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం, రంగారెడ్డి కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు నోటీసులిచ్చిం ది.

విచారణను 2 వారాలకు వాయి దా వేస్తూ చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌ శ్రవణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ల డివిజన్‌‌‌‌‌‌‌‌ బెం చ్‌‌‌‌‌‌‌‌ మంగళవారం ఆదేశాలిచ్చింది.  ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వ హించకుండా మండల అధ్యక్ష పదవి కి ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణ యం అమలును నిలిపివేయాలం టూ మండల పరిషత్ ఉపాధ్యక్షురా లు సునీత పిటిషన్ దాఖలు చేశారు.