తనపై పెట్రోల్ పోసుకొని.. భార్యపై కూడా పోసిన భర్త.. ఇద్దరూ మృతి

తనపై పెట్రోల్ పోసుకొని.. భార్యపై కూడా పోసిన భర్త.. ఇద్దరూ మృతి

వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తనపై పెట్రోల్ పోసుకొని.. ఆపై భార్య మీద కూడా పోసి నిప్పంటించుకున్నాడు. కరీమాబాద్ మండలం, ఎస్.ఆర్.ఆర్ తోట ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు.  స్థానికంగా నివసించే బండి భాస్కర్, విజయ దంపతులు. భాస్కర్ వ్యసనాలకు అలవాటుపడి రూ. 20 లక్షలు అప్పుచేశాడు. వాటిని తీర్చడం కోసం పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని విజయపై భాస్కర్ ఒత్తిడి తెచ్చేవాడు. ఆ వేధింపులు పడలేని విజయ.. 20 రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్‌లో భాస్కర్‌పై ఫిర్యాదు చేసింది. దాంతో కోపం పెంచుకున్న భాస్కర్.. చుట్టుపక్కల వాళ్లు చూస్తుండగానే.. తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని.. ఆ తర్వాత భార్యపై కూడా పోసి నిప్పంటించుకున్నాడు. దాంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. విజయ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకొని విచారిస్తే.. ఈ దారుణం జరిగేదికాదని విజయ బంధువులు వాపోతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.