మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ పరిధిలో రెండో విడత ‘కంటి వెలుగు’ మెయింటనెన్స్ ఫండ్స్ పక్కదారి పడుతున్నాయని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్ట్ ఆఫ్తాల్మిక్ డాక్టర్ గురువారం సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశాడు. డిప్యూటీ డీఎంహెచ్వోపై వీడియోలో ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
కంటివెలుగుకు 25 టీములు పనిచేస్తున్నాయని, వీరికి భోజనాలు, టెంట్ ఖర్చు రూ. 35 లక్షలు కాగా, 90 శాతం ఖర్చును లోకల్ లీడర్లపై వేసి ..మిగిలిన సొమ్మును స్వాహా చేశారని ఆ వీడియోలో వెంకన్న ఆరోపించారు. ఈ విషయమై లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ‘కంటి వెలుగు’ క్యాంప్ను విజిట్ చేసి విచారణ చేపట్టారు.