నేడు ఇండియా‑శ్రీలంక చివరి టీ20

నేడు ఇండియా‑శ్రీలంక చివరి టీ20

నేడు ఇండియా‑శ్రీలంక చివరి టీ20
గెలిచిన వాళ్లదే సిరీస్‌‌
రా. 7 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌, డీడీ స్పోర్ట్స్‌‌లో లైవ్​

రాజ్‌‌‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌ : తొలి మ్యాచ్‌‌‌‌లో ఇండియా థ్రిల్లింగ్‌‌‌‌ విక్టరీ. రెండో పోరులో శ్రీలంక గెలుపు. సిరీస్‌‌‌‌లో 1–1తో ఇరు జట్లూ  సమంగా ఉన్నాయి. ఇప్పుడు సిరీస్‌‌‌‌లో విన్నర్‌‌‌‌ ఎవరో తేలే టైం వచ్చింది. మూడు టీ20ల సిరీస్‌‌‌‌లో భాగంగా శనివారం ఇక్కడ జరిగే చివరి పోరులో ఇండియా, శ్రీలంక అమీతుమీకి రెడీ అయ్యాయి.  ఈ మ్యాచ్‌‌‌‌లో గెలిచి సిరీస్‌‌‌‌ సొంతం చేసుకోవాలని ఇరు జట్లూ ఆశిస్తున్నాయి.  వాంఖడేలో రెండు రన్స్‌‌‌‌ తేడాతో గట్టెక్కిన టీమిండియా పుణెలో గత పోరులో బౌలింగ్‌‌‌‌తో పాటు టాపార్డర్ ఫెయిల్యూర్‌‌‌‌ కారణంగా ఓటమి కొని తెచ్చుకుంది.  ముఖ్యంగా ఇండియా యంగ్‌‌‌‌ బౌలర్ల నిలకడలేమని జట్టును దెబ్బకొట్టింది. లెఫ్టార్మ్‌‌‌‌ పేసర్‌‌‌‌ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ నేతృత్వంలోని పేస్‌‌‌‌ యూనిట్‌‌‌‌ పుణెలో ‘గీత’ దాటింది. పలు గాయాల తర్వాత జట్టులోకి తిరిగొచ్చిన అర్ష్‌‌‌‌ దీప్‌‌‌‌ రెండు ఓవర్ల స్పెల్‌‌‌‌లో ఐదు నో బాల్స్‌‌‌‌ వేసి విమర్శల పాలయ్యాడు. తన తొలి ఓవర్లోనే  మూడు సార్లు లైన్‌‌‌‌ దాటిన అతను హ్యాట్రిక్‌‌‌‌ నో బాల్స్‌‌‌‌ వేసిన తొలి ఇండియన్‌‌‌‌గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. స్లాగ్‌‌‌‌ ఓవర్లలో బౌలర్లు భారీగా రన్స్‌‌‌‌ లీక్‌‌‌‌ చేయడం జట్టును ముంచింది. ఇలాంటి పొరపాట్లతో యంగ్‌‌‌‌స్టర్స్ పాఠాలు నేర్చుకుంటారని కోచ్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌ పాండ్యా చెబుతున్నారు. కానీ, ఆఖరాటలోనూ ఇదే రిపీట్‌‌‌‌ చేస్తే శ్రీలంక చేతిలో ఇండియా సిరీస్‌‌‌‌ కోల్పోతుంది. ఇక, వరసగా రెండు మ్యాచ్‌‌‌‌ల్లోనూ ఇండియా టాపార్డర్‌‌‌‌ నిరాశ పరిచింది. రెండు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో 7,5 స్కోర్లు చేసిన ఓపెనర్​ గిల్‌‌‌‌ పుంజుకోకపోతే బెంచ్‌‌‌‌పై ఉన్న రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌కు తన ప్లేస్‌‌‌‌ కోల్పోవాల్సి వస్తుంది. ఇషాన్‌‌‌‌ నుంచి మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ మంచి ఆరంభం ఆశిస్తోంది. శాంసన్‌‌‌‌ గాయపడటంతో టీ20 డెబ్యూ చాన్స్‌‌‌‌ దక్కించుకున్న రాహుల్‌‌‌‌ త్రిపాఠి దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌‌‌‌లోనూ రాణించకపోతే అతనికి మరో అవకాశం రావడం కష్టమే అవుతుంది. ఇక, టీ20 కెప్టెన్‌‌‌‌గా ఆడిన ఆరు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో  హార్దిక్‌‌‌‌ పాండ్యా తన మార్కు చూపెట్టలేకపోయాడు. పుణెలో భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో ఫెయిలైన పాండ్యా టీమ్‌‌‌‌ను ఇప్పుడు ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. సూర్యకుమార్‌‌‌‌ మెరుపు ఫిఫ్టీతో టచ్‌‌‌‌లోకి రాగా.. జడేజా ఆబ్సెంట్‌‌‌‌లో అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌తో ఇరగదీస్తున్నాడు.  అయితే, ఈ ఇద్దరి కంటే ముందు టాపార్డర్‌‌‌‌ నుంచి సరైన సహకారం అందితేనే ఇండియా సిరీస్‌‌‌‌ నెగ్గగలదు.

జోరు మీద లంక

ఈ సిరీస్​లో అండర్‌‌‌‌ డాగ్‌‌‌‌గా బరిలోకి దిగిన శ్రీలంక సమయం గడుస్తున్న కొద్దీ అద్భుతంగా ఆడుతోంది. ముఖ్యంగా ఆ టీమ్‌‌‌‌ లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ గొప్పగా పోరాడుతోంది. భారీ ఓటమి తప్పదనుకున్న తొలి పోరును ఆఖరి బాల్‌‌‌‌ వరకూ తీసుకురాగా.. పుణెలో లేట్‌‌‌‌ హిట్టింగ్‌‌‌‌తో భారీ స్కోరు సాధించి సిరీస్‌‌‌‌ రేసులో నిలిచింది. ఆ విజయంతో లంక కాన్ఫిడెన్స్‌‌‌‌ పెరిగింది. అదే జోరును మూడో పోరులోనూ కొనసాగించి సిరీస్‌‌‌‌ నెగ్గాలని ఆశిస్తోంది. రాజ్‌‌‌‌కోట్‌‌‌‌ ఫ్లాట్‌‌‌‌ వికెట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలం కాబట్టి టాస్‌‌‌‌ కీలకం కానుంది. టాస్‌‌‌‌ నెగ్గిన జట్లు ఛేజింగ్‌‌‌‌ కే మొగ్గు చూపొచ్చు.