నష్ట పరిహారం రాలేదని వృద్ధురాలు సూసైడ్

నష్ట పరిహారం రాలేదని వృద్ధురాలు సూసైడ్

సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. ప్రాజెక్ట్ కింద భూమి కొల్పోయిన తనకు నష్ట పరిహారం రాలేదని ఓ వృద్ధురాలు సూసైడ్ చేసుకొని చనిపోయింది.వేములఘాట్ గ్రామానికి చెందిన మాగారి బాలమ్మ (80) అనే మహిళకు చెందిన భూమి మల్లన్న సాగర్ కింద మునిగిపోయింది. అయితే తనకు ఇంకా   ఆర్అండ్ఆర్ ప్యాకేజీ నష్ట పరిహారం రాలేదని మనస్థాపానికి గురైన బాలమ్మ.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దాంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.