ఎన్​కౌంటర్ ​100 % కరెక్ట్: ​ఎమ్మెల్యే

ఎన్​కౌంటర్ ​100 % కరెక్ట్: ​ఎమ్మెల్యే

మెట్ పల్లి, వెలుగు: దిశపై   నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం వంద శాతం కరెక్ట్. దిశపై హత్యాచారం చేసినప్పుడు స్పందించని మానవ హక్కుల సంఘాలు.. నిందితుల ఎన్ కౌంటర్ అనంతరం స్పందించడం సభ్యసమాజాన్ని ఆలోచింపజేస్తోందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. విచారణ పేరిట రాద్ధాంతం చేస్తూ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని మానవ హక్కుల సంఘాలు దెబ్బ తీస్తున్నాయని ఆయన  పేర్కొన్నారు. మహిళలపై  లైంగిక దాడులకు వ్యతిరేకంగా మంగళవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు ఆధ్వర్యంలో వేలాది మంది స్టూడెంట్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు, హత్యాచారాలు చేసే నిందితులకు నెల రోజుల్లోపు  శిక్ష పడేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళలపై వేధింపులు జరిగినప్పుడు ప్రజలంతా కలిసికట్టుగా స్పందించాలని, బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.