అనుష్క ప్రింటెడ్ షర్ట్.. ధర ఎంతంటారు..!

అనుష్క ప్రింటెడ్ షర్ట్..  ధర ఎంతంటారు..!

వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కింగ్  విరాట్ కోహ్లీ సెంచరీతో విజృంభించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీ (50)లు చేసిన తొలి ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డును సృష్టించాడు. విరాట్‌ చరిత్ర సృష్టించడంతో స్టేడియం ఒక్కసారిగా మారుమోగిపోయింది. అయితే  ఈ మ్యాచ్ ను చూసేందుకు వచ్చిన కోహ్లీ సతీమణి, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మ ప్రతీ మూమెంట్ ను ఎంజాయ్ చేసింది.  కోహ్లీ ఫోర్, సిక్సర్ కొడుతుంటే  అనుష్క శర్మ తెగ ఎంజాయ్ చేసింది.  ఈ అందమైన దృశ్యాలు కెమెరామెన్లు తమ కెమెరాలో బంధించగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

మరీ ముఖ్యంగా . కోహ్లీ సెంచరీ చేసిన టైమ్ లో అయితే అనుష్క ముద్దుల వర్షం కురిపించేసింది. కోహ్లీ కూడా అమెకు రివర్స్‌లో ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు.  ఈ క్రమంలో అనుష్క వేసుకున్న డ్రెస్ కూడా అందరి దృష్టిని అకర్షి్ంచింది.   దీంతో ఆమె వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంత అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.  బ్రాండ్ వెబ్‌సైట్‌లో  ఈ పూల- ప్రింట్ చొక్కా ధర రూ. 19,500 గా చూపిస్తుంది.  మొత్తం సెట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే రూ.27,500 ఖర్చవుతుంది.

సొంతగడ్డపై జైత్రయాత్ర కొనసాగించిన టీమిండియా వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో నాలుగోసారి ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది. ఫ్యాన్స్‌‌‌‌, సెలబ్రిటీలతో కిక్కిరిసిన వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన తొలి సెమీస్‌‌‌‌లో రోహిత్‌‌‌‌సేన 70  రన్స్‌‌‌‌ తేడాతో కివీస్‌‌‌‌ను చిత్తుగా ఓడించింది. విరాట్ కోహ్లీ (113 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 117), శ్రేయస్ అయ్యర్​ (70 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 105) సెంచరీలతో కదం తొక్కడంతో తొలుత ఇండియా 50 ఓవర్లలో 397/4 స్కోరు చేసింది.