తండ్రిపై పెట్రోల్ ‌‌పోసి నిప్పంటించిన కొడుకు

తండ్రిపై పెట్రోల్ ‌‌పోసి నిప్పంటించిన కొడుకు

తండ్రిపై పెట్రోల్ ‌‌పోసి నిప్పంటించిన కొడుకు
తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతి
బాన్సువాడ, వెలుగు : బాన్సువాడ టౌన్‌‌లోని కుమ్మరి గల్లికి చెందిన నరేందర్ అనే యువకుడు తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టగా తీవ్ర గాయాలతో హాస్పి టల్‌ లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాన్సువాడ పట్టణంలో కుమ్మరిగల్లిలో నివసిస్తున్న కుమ్మరి శ్రీనివాస్(48) కుఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. కూతురు పెండ్లి అయి అత్తవారింటి వద్ద ఉంటుండగా, చిన్న కొడుకు హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. పెద్ద కొడుకు నరేందర్ ఇంటి వద్ద ఉండి తాగుడుకు బానిసయ్యాడు. కొన్ని రోజుల పాటు ఆర్మూర్లో పని నిమిత్తం వెళ్లి ఇంటికివచ్చాడు.

ఈనెల23న రాత్రితండ్రి శ్రీనివాస్కు, కొడుకు నరేందర్ కు మాటామాటా పెరిగి కొట్లాటకు దిగారు. కొడుకు ఆవేశంలో ఇంట్లో బాటిల్‌ లో ఉన్న పెట్రోలు తీసి తండ్రి మీద పోసి నిప్పటించాడు. వెంటనే బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేసి నిజామాబాద్‌ జీజీహెచ్  పంపారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు . కొడుకు మీద మరర్్డ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేష్ గౌడ్ తెలిపారు.