ఎగ్జామ్‌‌‌‌ క్వాలిఫై కానోళ్లూ అప్లై చేసుకోవచ్చు

ఎగ్జామ్‌‌‌‌ క్వాలిఫై కానోళ్లూ అప్లై చేసుకోవచ్చు

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి నిర్వహించే స్పాట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. సర్కారు కాలేజీల్లో మిగిలిన సీట్లకు మంగళ, బుధవారాల్లో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ కోరారు. పాలిసెట్ క్వాలిఫై కాని స్టూడెంట్లూ అప్లై చేసుకోవాలని, వారికి 12న ర్యాంకులు కేటాయిస్తామన్నారు. ఈ నెల 9 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు, 16న సీట్ల అలామెంట్ ఉంటుందన్నారు.  ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఈ నెల 12న వెకెన్సీ సీట్ల వివరాలను వెల్లడించాలని, అప్లికేషన్లు తీసుకోవాలని కాలేజీలకు సూచించారు. 16న స్పాట్ అడ్మిషన్లు కాలేజీలే ఇస్తాయని ఆయన తెలిపారు.