ఫోన్ ​ట్యాపింగ్ ​బాధ్యులపై..ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి

ఫోన్ ​ట్యాపింగ్ ​బాధ్యులపై..ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
  •     తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ

బషీర్ బాగ్, వెలుగు :  ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్​రెడ్డికి, డీజీపీకి ఫిర్యాదు చేశామని జేఏసీ నాయకులు చెప్పారు. బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో శుక్రవారం 

జేఏసీ కన్వీనర్ బత్తుల కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఫోన్​ ట్యాపింగ్ చేయడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కిందకు వస్తుందన్నారు. ఈ అంశంపై ప్రశ్నించిన మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.