లెక్చరర్ల పోస్టులే అధికం.. టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ

లెక్చరర్ల పోస్టులే అధికం.. టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరిన్ని పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఎడ్యుకేషన్, ఆర్కైవ్స్ డిపార్ట్​మెంట్లలో మొత్తం 2,440  పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ.. ఆర్థికశాఖ స్పెషల్​సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఇందులో జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. కాలేజీయేట్ఎడ్యుకేషన్, కాలేజీయేట్ఆఫ్​ ఇంటర్​ ఎడ్యుకేషన్, టెక్నికల్​ఎడ్యుకేషన్​పరిధిలోని లెక్చరర్​ పోస్టులతో పాటు లైబ్రేరియన్, ఫిజికల్​ డైరెక్టర్ పోస్టులకు కూడా అనుమతి లభించింది.​ అమోదం తెలిపిన వాటిలో2,130 ఖాళీలు లెక్చరర్​ పోస్టులు కాగా, 95 లైబ్రేరియన్ ​పోస్టులు, 157 ఫిజికల్​ డైరెక్టర్, 5 మాట్రన్, డైరెక్టర్ ఆఫ్​ స్టేట్​ఆర్కైవ్స్​లో 14 పోస్టులున్నాయి. ఖాళీలను టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. తాజాగా ప్రకటించిన పోస్టులతో ఇప్పటి వరకు డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​కు ప్రభుత్వం అనుమతించిన పోస్టుల సంఖ్య 49,428కు చేరింది.