ఇవాళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ

ఇవాళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ

ఢిల్లీ : ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ జస్టిస్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం కేసు విచారించనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి తెలంగాణ హైకోర్టు అప్పగించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కేసు సీబీఐ చేతికి వెళ్తే.. చేసేదేం ఉండదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లుత్రా చెప్పారు.