తెలంగాణ భవన్ సాక్షిగా బీఆర్ఎస్లో బయటపడ్డ వర్గపోరు..

తెలంగాణ భవన్ సాక్షిగా బీఆర్ఎస్లో బయటపడ్డ వర్గపోరు..

బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు బయటపడింది. తెలంగాణ భవన్ సాక్షిగా నేతలు ఒకరి పై ఒకరు పరస్పర నినాదాలు చేసుకున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన చేవెళ్ల లోక్‌సభ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతుండగా పైలెట్ రోహిత్ రెడ్డి వర్గం నినాదాలు చేసింది. 

 ఇరువర్గాల నాయకులు పరస్పర నినాదాలతో సమావేశం వేడెక్కింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో మాజీ మంత్రి హరీశ్‌రావు కలగజేసుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. దీంతో బీఆర్ఎస్ నేతలు శాంతించారు.