చనిపోయిన వ్యక్తి కోసం పెద్ద సాహసమే చేసిన్రు

చనిపోయిన వ్యక్తి కోసం పెద్ద సాహసమే చేసిన్రు

ములుగు(గోవిందరావుపేట), వెలుగు :  చనిపోయిన బంధువు చివరి చూపు కోసం చత్తీస్​గఢ్​కు చెందిన గిరిజనులు పెద్ద సాహసమే చేశారు. భారీ వర్షాలను లెక్కచేయకుండా చంటిబిడ్డతో ఉధృతంగా ప్రవహిస్తున్న ఒర్రెను దాటారు. భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో చనిపోగా ఆమె బంధువులు 10మంది చత్తీస్​గఢ్ ​నుంచి ప్రైవేటు వాహనంలో గోవిందరావుపేట మండలం పస్రా, నార్లాపూర్​ మీదుగా దూదేకులపల్లి వెళ్లేందుకు వచ్చారు. వర్షాలతో పస్రా నుంచి నార్లాపూర్​వెళ్లే దారిలో ప్రాజెక్టునగర్​ వద్ద పాముల ఒర్రె తీవ్ర రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలీసులు ఆ వైపు ఎవరూ వెళ్లకుండా ట్రాక్టర్లు అడ్డుపెట్టారు. దీంతో ఒకరినొకరు పట్టుకొని వాగుదాటి దూదేకులపల్లికి వెళ్లారు. వీరిలో నెలల వయస్సున్న చంటిబిడ్డ ఉన్నా లెక్కచేయలేదు.