గుప్తనిధుల కోసం సొరంగంలోకి యువకులు.. నాగుపాము ప్రత్యక్షం..

గుప్తనిధుల కోసం సొరంగంలోకి యువకులు.. నాగుపాము ప్రత్యక్షం..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో సొరంగం కలకలం రేపుతోంది. సొరంగంలో గుప్త నిధులు ఉండవచ్చనే ఉద్దేశంతో లోపలికి వెళ్లారు నలుగురు యువకులు. లోపలికి సగం దూరం వెళ్లిన తర్వాత పెద్దనాగు పాము ప్రత్యక్షం కావడతో.. ఇంకేముంది వారికి ప్రాణం పోయినంత పనైంది. భయంతో బయటకు పరుగులు తీశారు.

సొరంగం నుండి బయటకు పది ఫీట్ల నాగు పాము బయటకు రావడంతో ఇంకా ఆ షాక్ నుంచి యువకులు బయటకు రావడం లేదు. అత్తాపూర్ వద్ద పురాతన కట్టడమైన ముశక్ మహల్ లో సొరంగం ఉందని నలుగురు యువకులు గుర్తించారు.

ఫోటో షూట్ కోసం ముశక్ మహల్ కు వెళ్లారు. అయితే.. అక్కడ ఎవ్వరూ చూడని సొరంగం కనిపించింది. ఇంకేముందు.. దానిపై ఏదో రిసెర్చ్ చేయాలని కలగన్నారు. ఎలాగైనా ఇదేంటో తెలుసుకోవాలని ఆశపడ్డారు. ఆ సొరంగం దారి ఎక్కడకు వెళ్తుంది..?  అందులో ఏముంది..? అనే పలు అనుమానాలు రావడంతో లోపలికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.

లోపలికి సగం దూరం వరకూ వెళ్లడంతో పెద్ద నాగుపాము ప్రత్యక్షమైంది. దాన్ని చూసి నలుగురు యువకులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ విషయం తెలిసి స్థానికులు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మహల్ లో గుప్త నిధులు ఉండొచ్చని చర్చించుకుంటున్నారు. స్థానికంగా ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.