రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ శనివారం సందర్శించారు. పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించారు. ఈ స్కూల్ఒక అద్భుతమని, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే సర్కారు లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, ఆఫీసర్లుగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని విద్యార్థులకు సూచించారు.
