చంపేసి కాల్చేసిన్రు

చంపేసి కాల్చేసిన్రు
  • నిజామాబాద్​ జిల్లా​లో దారుణం.. గుర్తుపట్టలేని స్థితిలో మహిళ మృతదేహం 
  • రేప్​చేసి మర్డర్​ చేశారని అనుమానిస్తున్న పోలీసులు

మక్లూర్, వెలుగు: నిజామాబాద్​ జిల్లాలో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. రోడ్డు పక్కన పొలంలో పెట్రోల్​ పోసి కాల్చేశారు. మాక్లూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ముల్లంగి (బి), శాంతినగర్​ గ్రామాల మధ్య రోడ్డుపక్కన వరి పొలంలో కాలిపోయిన డెడ్​బాడీని స్థానికులు మంగళవారం చూశారు. వెంటనే పోలీసులకు ఫోన్​ చేశారు. మృతదేహం 90 శాతం కాలిపోయిందని, గుర్తించలేని స్థితిలో ఉందని  పోలీసులు తెలిపారు. కాళ్లకు ఉన్న మట్టెల ఆధారంగా చనిపోయిన వ్యక్తి మహిళ అని నిర్ధారించామన్నారు. ఆమె వయసు 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉంటుందని, ఎక్కడో చంపి సంచిలో ఇక్కడికి తెచ్చి ఉంటారని భావిస్తున్నారు. రేప్​ అండ్​ మర్డర్​గా అనుమానిస్తున్నారు.