యువతి గొంతు కోసిన దుండగులు

యువతి గొంతు కోసిన దుండగులు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి టౌన్​లో మంగళవారం  ఉదయం  ఒక యువతి ఇంటిదగ్గర పని చేసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోశారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డిలోని  బర్కత్​పురాకు చెందిన నాయబ్ హబీబ్​కు నిజామాబాద్​లోని మాలపల్లికి చెందిన నిషాక్​ ఫిర్​దౌస్​ (21)తో  తొమ్మిది నెలల కింద పెళ్లి జరిగింది. హబీబ్​ డ్రైవర్​గా పని చేస్తుండగా, ఆమె ఇంట్లోనే ఉంటుంది. మంగళవారం ఉదయం ఇంటి ముందు ఫిర్​దౌస్​ పని చేసుకుంటోంది. భర్త ఇంటి లోపల ఉండగా, ఆమె మామ ఇంటికి కొద్ది దూరంలో  వాకింగ్​ చేస్తున్నారు. సడన్​గా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమె మీద దాడిచేసి..  గొంతు కొశారు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను జిల్లా హాస్పిటల్​కు తరలించారు. కామారెడ్డి  డీఎస్పీ సోమనాథం,  టౌన్​ సీఐ మధుసూదన్​ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్​ టీమ్, డాగ్​స్వ్వాడ్ ను రప్పించారు.  ఫిర్​దౌస్​  రెండు నెలల కిందట ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. పోలీసులు పలు కోణాల్లో  విచారణ చేస్తున్నారు.  బాధితురాలు మాట్లాడితే  మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.