రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది.. కిషన్ రెడ్డి

రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది.. కిషన్ రెడ్డి

2024 ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి దమ్ము, దైర్యం లేదని, ఇచ్చిన హామీలు అమలు చేస్తారో లేదో ముందు చెప్పాలని అన్నారు. హామీలు గురించి చెప్పడం మానేసి, బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చే కార్యకర్తలు బీజేపీలో ఉన్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం పదికోట్లు ఇస్తే గాడిద గుడ్డుతో పిలుస్తున్నారని, రేవంత్ రెడ్డి సిగ్గుపడాలని మండిపడ్డారు కిషన్ రెడ్డి.