50 రోజుల తర్వాత జనంలోకి కేజ్రీవాల్..

50 రోజుల తర్వాత జనంలోకి కేజ్రీవాల్..

 ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.  50 రోజుల జైలు జీవితం తర్వాత కేజ్రీవాల్ బయటకొచ్చారు. లిక్కర్ స్కాంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్ ఇవాళ సాయంత్రం విడుదలయ్యారు.  జూన్ 1 వరకు బెయిల్ ఇచ్చింది కోర్టు. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెయిల్ ఇచ్చినట్లు కోర్టు వెల్లడించింది. జైలు నుంచి బయటకు రాగానే కేజ్రీవాల్‌కు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.