ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ షాక్ ఇచ్చింది. రైల్వే ప్రయాణ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్న ట్లు రైల్వే అధికారులు సర్క్యూలర్ జారీ చేశారు.
215 కి.మీ దాటిన ఆర్డినరీ క్లాస్ పై ఒక్క పైసా, నాన్ ఏసీ మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లుకు 2 పైసాలు, ఏసీ క్లాస్ కు 2 పైసాలు, 500 కి,మీ దాటిన నాన్ ఏసీ ప్ర యాణాలకు రూ.10 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అయితే లోకల్ ట్రైన్లు, నెలలో ఒకసారి ప్రయాణించే రైళ్లుకు 215 కి.మీ లోపల ప్రయా ణాలకు ఇది వర్తించదు. పెరిగిన చార్జీల కారణంగా రూ. 600 కోట్ల ఆదాయం వస్తుందని రైల్వే శాఖ అంచనా వేసింది.
