- ముగ్గురు ఫ్రెండ్స్ను అరెస్ట్ చేసిన కుషాయిగూడ పోలీసులు
కుషాయిగూడ, వెలుగు: కాలేజీ ఫీజులు కట్టేందుకు షాపులో డబ్బు చోరీ చేసిన ముగ్గురిని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి పరిధి ప్రశాంత్నగర్లోని సాయిపురి కాలనీలో ఉండే దండ్ల నవీన్ (18), వసంత పురి కాలనీలో ఉండే కొనిపాక ప్రశాంత్ (19), మౌలాలి హెచ్బీ కాలనీలోని లక్ష్మి నగర్లో ఉండే కాలబండి రమేష్(18)లు ఫ్రెండ్స్. వీరికి కాలేజ్ఫీజులు, స్కూల్ సర్టిఫికెట్తెచ్చుకునేందుకు డబ్బులు అవసరం పడ్డాయి. ఏఎస్రావు నగర్ లో ఉండే సముద్రాల సుప్రభాత్ కు చెందినజియో మార్ట్షాప్లో బుధవారం రాత్రి చోరీ చేసి రూ. 4 లక్షల 30 వేలు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం 5 గంటలకు సుప్రభాత్ షాపు షటర్కట్చేసి ఉండడం చూసి లోనికి వెళ్లగా కౌంటర్లోని డబ్బులు కనిపించలేదు. సీసీ ఫుటేజ్ఆధారంగా కుషాయిగూడ పోలీసులకు కంప్లయింట్చేశాడు. విచారణలో భాగంగా పోలీసులు సుప్రభాత్ వద్ద పనిచేసిన వ్యక్తుల పనేనని గుర్తించి నిందితులను అరెస్ట్ చేసిన చోరీ అయిన డబ్బును రికవరీ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని కుషాయిగూడ ఇన్స్పెక్టర్మన్మోహన్ యాదవ్ తెలిపారు. పోలీసులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ అభినందించారు.