కాలేజీ ఫీజులు కట్టేందుకు చోరీ

కాలేజీ ఫీజులు కట్టేందుకు చోరీ
  • ముగ్గురు ఫ్రెండ్స్​ను అరెస్ట్​ చేసిన కుషాయిగూడ పోలీసులు

కుషాయిగూడ, వెలుగు:  కాలేజీ ఫీజులు కట్టేందుకు​ షాపులో డబ్బు చోరీ చేసిన ముగ్గురిని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్​ చేశారు. మల్కాజిగిరి పరిధి ప్రశాంత్​నగర్​లోని సాయిపురి కాలనీలో ఉండే  దండ్ల నవీన్​ (18), వసంత పురి కాలనీలో  ఉండే కొనిపాక ప్రశాంత్​ (19), మౌలాలి హెచ్​బీ కాలనీలోని లక్ష్మి నగర్​లో ఉండే కాలబండి రమేష్​(18)లు ఫ్రెండ్స్​. వీరికి  కాలేజ్​ఫీజులు, స్కూల్ సర్టిఫికెట్​తెచ్చుకునేందుకు డబ్బులు అవసరం పడ్డాయి.  ఏఎస్​రావు నగర్ లో ఉండే సముద్రాల సుప్రభాత్ కు చెందిన​జియో మార్ట్​షాప్​లో బుధవారం రాత్రి చోరీ చేసి రూ. 4 లక్షల 30 వేలు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం 5 గంటలకు సుప్రభాత్ షాపు షటర్​కట్​చేసి ఉండడం చూసి లోనికి వెళ్లగా కౌంటర్​లోని డబ్బులు కనిపించలేదు. సీసీ ఫుటేజ్​ఆధారంగా కుషాయిగూడ పోలీసులకు కంప్లయింట్​చేశాడు. విచారణలో భాగంగా పోలీసులు  సుప్రభాత్ వద్ద పనిచేసిన వ్యక్తుల పనేనని గుర్తించి నిందితులను అరెస్ట్​ చేసిన చోరీ అయిన డబ్బును రికవరీ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించామని కుషాయిగూడ ఇన్​స్పెక్టర్​మన్మోహన్​ యాదవ్​ తెలిపారు. పోలీసులను రాచకొండ సీపీ మహేష్​ భగవత్​ అభినందించారు.