ఊరికెళ్లొచ్చేలోగా చోరీ.. 2 తులాల బంగారం, 20 తులాల వెండి ఎత్తుకెళ్లిన దొంగలు

ఊరికెళ్లొచ్చేలోగా చోరీ.. 2 తులాల బంగారం, 20 తులాల వెండి ఎత్తుకెళ్లిన దొంగలు

శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో ఘటన

శంషాబాద్, వెలుగు: ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలు బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊట్ పల్లి గ్రామంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన నవీన్ కుమార్ పెయింటర్ గా పనిచేస్తున్నాడు. అతడు ఉంటున్న బిల్డింగ్ లోనే పై పోర్షన్ లో అన్న నర్సింహా ఉంటున్నాడు. ఈ నెల 2న సాయంత్రం కిస్మత్​పురాలోని తన అత్తగారింటికి వెళ్లాడు.

బుధవారం ఉదయం 6 గంటలకు నవీన్ అన్న నర్సింహా అతడికి ఫోన్ చేశాడు. కింది పోర్షన్ లో ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయని చెప్పాడు. నవీన్ వెంటనే ఇంటికి వచ్చి చూడగా.. బీరువాలోని 2 తులాల బంగారం, 20 తులాల వెండి కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి శంషాబాద్ రూరల్ పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.