అంతిమ విజయం మాదే..!

అంతిమ విజయం మాదే..!

బీజేపీ ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తుందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేసి గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుందన్నారు. గెహ్లాట్ కి బలం ఉన్నా గవర్నర్ అసెంబ్లీని నిర్వహించడం లేదన్నారు. మోడీ, అమిత్ షా కనుసన్నల్లోనే రాజస్థాన్ లో ఇలాంటి విధానాలు అవలంబిస్తున్నారన్నారు. మోడీ, బీజేపీ తాత్కాలిక ఆనందం పొందొచ్చు కానీ అంతిమ విజయం తమదేన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని కాపాడండి అనే నినాదంతో చలో రాజ్ భవన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కూడా నిరసన తెలిపే హక్కు లేదన్నారు. ఎక్కడిక్కడ పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా ప్రజాస్వామ్యం లేదన్నారు.