ధోని లాంటి మరో ప్లేయర్ ఎప్పటికీ రాలేడు: మిథాలీ రాజ్

ధోని లాంటి మరో ప్లేయర్ ఎప్పటికీ రాలేడు: మిథాలీ రాజ్

టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని రిటైర్‌ మెంట్‌పై భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ స్పందించారు. ధోని లాంటి ప్లేయర్ ఎప్పటికీ రాలేడన్నారు. ప్రతి ఒక్క క్రికెటర్‌కు మహీ ఓ ప్రేరణ అని అన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ధోని శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు.

దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు మిథాలీ. ప్రతి క్రికెటర్‌కు ఎంఎస్‌ ధోని ఓ ప్రేరణ అన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుని.. అనుకున్నది సాధించే చిన్న పట్టణాలకు చెందిన కుర్రాళ్లందరికీ మహీ ఓ ఆదర్శమన్నారు. అత్యంత ఒత్తిడి సమయాల్లోనూ అతడు చూపించే ప్రశాంతత తన కెంతో ఇష్టమన్నారు. అతడి బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌ శైలికి వీరాభిమానిన్న మిథాలీ… అలాంటి ఆటగాడు మళ్లీ రాడు అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. ధోని ఎప్పటికీ  దిగ్గజమే అని అన్నారు.