
ఏఐసీసీ సూచనల మేరకే పార్టీలో చేరికలు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్. తాము డబ్బులు ఇచ్చి ఎవరినీ చేర్చుకోవట్లేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంపై ఆయన స్పందించారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ మంత్రులను చేసిందని తెలిపారు. కవిత విడుదల కోసం బీజేపీలో బీఆర్ఎస్ ను కలపాలని చూస్తున్నారని ఆరోపించారు.
హరీశ్రావుపై బండి సంజయ్ ప్రేమ ఒలకపోయడానికి కారణం అదే అన్నారు. బీఆర్ఎస్ విలీనాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు వద్దంటున్నారని తెలిపారు. సుల నుంచి తప్పించాలని అధికారులు మమ్మల్ని కోరుతున్నారు. కేసుల నుంచి తప్పిస్తే రూ. వందల కోట్లు ఇస్తామంటున్నారు చెప్పారు. కేసీఆర్ తప్పు లేకపోతే విద్యుత్ అంశంపై వేసిన కమిషన్ రద్దుకు సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు.