ఎమ్మెల్యే మంచిరెడ్డి ఫాంహౌస్​ లో దొంగలు పడ్డారు.. అల్మారా పగులగొట్టి నగదు నగలు చోరీ

ఎమ్మెల్యే మంచిరెడ్డి ఫాంహౌస్​ లో దొంగలు పడ్డారు.. అల్మారా పగులగొట్టి నగదు నగలు చోరీ
  • తలుపులు, అల్మారా పగులగొట్టి నగదు, నగలు చోరీ
  • ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పరిధిలో  ఘటన 

ఇబ్రహీంపట్నం, వెలుగు : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫాంహౌస్​లో దొంగలు పడి నగదు, నగలు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈనెల18న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సొంతూరు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులోని వ్యవసాయ క్షేత్రంలో  దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈనెల 9న ఫాంహౌస్​ ను శుభ్రం చేసి వచ్చిన కూలీలు, మళ్లీ ఈనెల18న మరోసారి అక్కడికి వెళ్లారు. 

మొదటి అంతస్తు డోర్లు పగులగొట్టి.. బెడ్రూంలోని వస్తువులు చిందర వందరగా పడి ఉండగా అనుమానం వచ్చి ఫాంహౌస్​ సూపర్ వైజర్ గడ్డం చంద్రశేఖర్ కు సమాచారం అందించారు. ఆయన వచ్చి పరిశీలించగా.. రూ.10 వేల విలువైన టైటాన్ వాచ్, అల్మారా పగులగొట్టి రూ. 50 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేశారు. అయితే.. ఫాంహౌస్​లో జరిగిన చోరీ బయటకు తెలియకుండా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భారీ మొత్తంలో నగదు, ఇతర వస్తువులు చోరీ అయినట్టు.. బయటకు తెలియకుండా తక్కువగా చోరీ జరిగినట్లు చెబుతున్నట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు.