కొడంగల్, వెలుగు: కొడంగల్ పట్టణంలోని లాహోటి కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. లాహోటీ కాలనీలోని ఓ ఇంట్లో చొరబడి సుమారు రూ. 3 లక్షల విలువైన బంగారం, వెండి సామగ్రి దోచుకెళ్లారు. అదే ప్రాంతంలో మరో ఇంటి ముందు కట్టేసి ఉన్న కోడెదూడలను సైతం ఎత్తుకెళ్లారు.
బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కొద్ది దూరంలోనే దొంగతనం జరగడం చర్చనీయాంశమైంది.