15 తులాల బంగారు అభరణాలు చోరీ చేసిన దొంగలు..

15 తులాల బంగారు అభరణాలు చోరీ చేసిన దొంగలు..

మేడ్చల్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడి డబ్బులు,బంగారం ఎత్తుకెళ్లారు.  వివరాల్లోకివ వెళ్తే.. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండ జన్మభూమి కాలనీలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇంట్లో కి చొరబడి రూ. 3లక్షల నగదు, 15 తులాల బంగారు అభరణాలు దోచుకున్నారు. 

బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుంటామని పోలీసలు తెలిపారు.