ఎస్ కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో చిత్రం ప్రారంభం

ఎస్ కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో చిత్రం ప్రారంభం

రాహుల్ శ్రీవాత్సవ్ అయ్యర్  నిర్మాతగా,  మురళి అలకపల్లి దర్శకత్వంలో శుక్రవారం కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత రాహుల్ మాట్లాడుతూ ‘మా ఎస్ కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నుంచి వస్తున్న మూడో చిత్రమిది. మొదటి సినిమా షూటింగ్ పూర్తయింది. ఫిబ్రవరిలో  రెండవ చిత్రాన్ని మొదలుపెట్టాం. ఇవాళ మూడో సినిమాకు శ్రీకారం చుట్టాం. మూడు పాత్రల మధ్య సాగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’ అని చెప్పారు. దర్శకుడు మురళి మాట్లాడుతూ ‘మే రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, జులైలో చిత్రీకరణ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఆగస్టు లేదా సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ చేస్తాం’ అని అన్నాడు.