స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తన వయస్సు 72 ఏండ్లని 1994లో ఉన్నంత శక్తి ఇప్పుడు తనలో లేదని అన్నారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఓపిక లేదని ఇదే చివరి పదవి తెలిపారు. ఈ నాలుగేళ్లు ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేస్తానని వెల్లడించారు. పనికిరాని వాళ్ళు, చట్టం రాజ్యాంగం తెలియని వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
జనగామ.జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరీ మాట్లాడుతూ బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నించారు. తానేమి ప్రణాళిక రచించుకొని కాంగ్రెస్ లోకి రాలేదని నియోజక వర్గ అభివృద్ధి కోసమే వచ్చానని తెలిపారు. ఏపీ వాలెంటరీ వ్యవస్థ తరహాలో తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు రాబోతున్నాయని స్పష్టం చేశారు.
ఏపీలో వాలేంటర్లకు గౌరవ వేతనం ఇస్తున్న తరహాలో తెలంగాణలోని ఇందిరమ్మ కమిటీలలో ఉన్న వారికి కూడా గౌరవ వేతనం ఉంటుందని వెల్లడించారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు సిఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో భాగ పనిచేసి మెజారిటీ తెచ్చినవారికే ఇందిరమ్మ కమిటీలలో స్థానం ఉంటుందని కడియం శ్రీహరి అన్నారు.