- రిపోర్టర్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ పై కేసు
జూబ్లీహిల్స్, వెలుగు : ఓ బిల్డర్ ను డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న రిపోర్టర్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరు ప్రభుత్వ రూల్స్ కు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టే వారిని గుర్తించి.. బ్లాక్ మెయిల్ చేస్తూ.. అందినకాడికి దోచుకుంటారు. ఇలాగే.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్10లో బిల్డర్ ప్రసాద్ ను రూ.1.20 కోట్లు ఇవ్వాలని, బల్దియాలో మీడియాను మేనేజ్ చేస్తామని రిపోర్టర్ ఆకుల కిరణ్ గౌడ్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి విశాల్ డిమాండ్ చేశారు.
కాగా ఆయన నిర్మించే భవనానికి అదనపు ఫ్లోర్ వేయాలనే ఆలోచన ఉంది. అయితే.. వారి వేధింపులు తట్టుకోలేక విరమించినా.. వేధింపులు ఆగకపోవడంతో బిల్డర్ ప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఐపీసీ384,506,120బీ సెక్షన్ కింద నమోదు చేశారు.